గాయత్రీవిద్య
వ్యాహృతి
వ్యాహృతి అంటే - శ్రీతేంద్రియానికి తెలిసే స్థూలమగు రూపము. ఉచ్చరించబడి వ్యాప్తి చెందేది. భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనేవి సప్తవ్యాహృతులు. వీటిలో
భూః -సన్మాత్ర
భువః -స్వరము
సువః- సుఖస్వరూపము
మహః- సర్వాతిశయము గలది, సర్వానికి కారణమైనది
తపః- పాలనస్వరూపము గలది
సత్యము - బ్రహ్మము
తైత్తిరీయోపనిషత్తులో, శిక్షావల్లిలోని ఐదవ అనువాకంలో పరబ్రహ్మకు అంగభూతాలయిన వ్యాహృతుల ఉపాసన చెప్పబడింది. వ్యాహృతులు అంటే కర్మలలో ఉపయోగించేవి అని అర్ధం. భూః, భువః, సువః అనేవి మూడు వ్యాహృతులు.
మహాచమస్యుడనే మహర్షి తపస్సు చేసి మహః అనే నాల్గవ వ్యాహృతిని కనిగొన్నాడు. మహః అనేదే బ్రహ్మము. మహః అనేది శరీరమైతే భూః, భువః, సువః అనేవి అంగాలు. అంగాలకు ఉనికి లభించినట్లుగా, మహః వల్ల మిగిలిన వాటికి ఉనికి లభిస్తోంది. వ్యాహృతులు బ్రహ్మకు అంగాలు కాబట్టి వీటి ఉపాసన చెప్పబడింది. వ్యాహృతుల ఉపాసన నాలుగురకాలు.
1. లోకదృష్టితో ఉపాసన :
భూః -భూలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
భువః -అంతరిక్ష్యాని దృష్టిలో ఉంచుకుని
సువః - స్వర్గలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
మహః - ఆదిత్యలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
ఉపాసన చెయ్యాలి. దీనితో లోకాలన్నీ సూర్యుని వెలుగుతో ప్రకాశమవుతాయి.
2. దేవదృష్టితో ఉపాసన :
భూః - అగ్ని దృష్టితో
భువః -ఆదిత్య దృష్టితో
సువః - వాయు దృష్టితో
మహః - చంద్రుని దృష్టితో
ఉపాసన చెయ్యాలి. అన్ని తేజస్సులు చంద్రునిచే పూజ్యములు
3. వేద ధృష్టితో ఉపాసన :
భూః -ఋగ్వేదము
భువః -సామవేదము
సువః - యజుర్వేదము
మహః - ఓంకారము
ఓంకారాన్ని మొదట, చివర చేర్చటం వల్లనే వేదాలు పూజనీయమవుతున్నాయి.
4. ప్రాణదృష్టితో ఉపాసన :
భూః -ప్రాణవాయువు
భువః -అపానవాయువు
సువః - వ్యానవాయువు
మహః -అన్నము
గా భావించి ఉపాసన చేయాలి. లోకంలో ప్రాణులన్నీ అన్నం చేతనే వృద్ధి పొందుతున్నాయి. ఈ రకంగా ఈ 16 వ్యాహృతులు హిరణ్యగర్భునికి అంగాలు. వీటిని తెలుసుకోగలిగినవాడే బ్రహ్మను గురించి తెలుసుకోగలుగుతాడు.
“సంధ్య అంటే సూర్యుని చేరిన బ్రహ్మ. ఆత్మ యొక్క అంశలైనటువంటి బ్రహ్మాది సకలభూతములచేత బ్రహ్మకు భిన్నముకానటువంటి సంధ్య ఉపాసించబడుచున్నది. దానికి నేను దాసుడను" అని మహాభారతంలో చెప్పబడింది. అటువంటి సంధ్య కు వేరైనది కాదు కాబట్టి మన సంధ్యా నామంతో పిలువబడుతోంది.
'బ్రహ్మది ఆకారభేదం చేత వేరుగా ఉన్నది. ఐనప్పటికీ కర్మకు సాక్షియై ప్రకాశించే ఈశ్వరశక్తియే సంధ్య' అని భారధ్వాజ స్మృతిలో చెప్పబడింది.
గాయత్రీ మంత్రము నాల్గవపాదముతో కూడినదై సంధ్యారూపిణి అవుతున్నది అని ఆగమాలు చెబుతున్నాయి. అందుచేత సంధ్యాకాలంలో ఉపాసించతగిన దేవత సంధ్య.
కాలికావురాణంలో సంధ్యాదేవి బ్రహ్మ యొక్క కుమార్తె అని చెప్పబడింది.
భగవతీపురాణంలో బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య తపస్సు చేసి శరీరాన్ని వదిలి వశిష్ఠుని భార్య అరుంధతిగా జన్మించింది అని చెప్పారు. చిఛక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరియే సంధ్య.
సంధ్యాదేవతయే గాయత్రి, సావిత్రి, పరమేశ్వరి. ఈ సంధ్యా దేవత సంధికాలమున ఉపాసించబడుతుంది. సూర్యుడు ఉదయించకముందు, నక్షత్రాలు అస్తమించకముందు కాలము ఉదయసంధ్య. అలాగే సూర్యుడు అస్తమించాడు. కాని నక్షత్రాలు పూర్తిగా లేవు. అది సాయంసంధ్య. ఇవి సంధ్యావందన కాలములు. ఈ సమయంలో ధ్యానించబడేదే సంధ్య. సూర్యుడి యందలి చైతన్యశక్తియే సంధ్య. ఈ దేవిని ఆజ్ఞాచక్రస్థానంలో ధ్యానం చెయ్యాలి.
పంచకోశాలలోను మనోమయకోశము సంధికోశము అదే సంధ్యాస్థానము అని చెప్పబడుతోంది.
సంధ్యాస్నానం జపో హోమో దేవతానాం చ పూజనం |
ఆతిధ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే |
సంధ్యావందనము, జపము హోమము, దేవతాపూజ, అతిధిపూజ వైశ్వదేవము ఈ ఆరు ప్రతినిత్యము చేయవలసినవి.
ద్విజులు అంటే రెండు జన్మలు గలవారు. బ్రహ్మక్షత్రియవైశ్యులు. వీరిచే పూజించబడునది. రేణుకాపురాణంలో “సంధ్యాదేవి దేవతలచేత, ద్విజులచేత మహాత్ములచేత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలయందు పూజించబడుతుంది" అని చెప్పబడింది.
5 తన్మాత్రలు - 6. శబ్ద 7.స్పర్శ 8.రస 9.రూప 10.గంధము - పంచభూతాలకు జ్ఞానేంద్రియాలకు మధ్య సంబంధం. దీని గురించి పూర్తి వివరం పంచతన్మాత్ర సాయక అనే నామంలో ఉన్నది.
10 ఇంద్రియాలు - 11.కళ్ళు 12.ముక్కు 13.చెవులు 14.నాలుక 15.చర్మము (ఇవి జ్ఞానేంద్రియాలు) 16.చేతులు 17.కాళ్ళు 18.నోరు 19.మలద్వారం 20.మూత్రద్వారం (ఇవి కర్మేంద్రియాలు). ఇవి పంచభూతాలతో చేయబడ్డాయి.
21.మనస్సు - ఇది ఇంద్రియాలకు అధిపతి
22.బుద్ధి - ఇది మనస్సుకు అధిపతి
23.చిత్తం - ఇది బుద్ధిని ప్రభావితం చేయ గలదు.
24.అహంకారం - ఇది పైవాటినన్నిటినీ శాశించగలదు
25.మాయ - ఈ మాయ వలనే పైనవన్నీ పరబ్రహ్మానికి భిన్నంగా అనిపిస్తాయి.
అమ్మ వీటన్నిటిని ఆసనంగా చేసుకుని వాటి పైన కూర్చుంటుంది. అంటే ఆవిడే పరబ్రహ్మం. గాయత్రీ దేవి తత్వమయీ - అంటే నీవు కానిది, నీవు అయినది అంతా ఆవిడే
పంచకోశాంతరస్థితా
కోశము అంటే , వర అని అర్ధం.
మానవ శరీరంలో ఐదుకోశాలున్నాయి. అవే
1. అన్నమయకోశము, 2. ప్రాణమయకోశము, 3.ఆనందమయకోశము, 4.మనోమయకోశము, 5.విజ్ఞానమయకోశము
ఆనందమయకోశము మిగతా నాలుగుకోశాలనడుమ ఉంటుంది. అందులోనే పరబ్రహ్మ ఉంటాడు.
వరుణ మహర్షి అప్పుడు చెప్పాడు. "కుమారా ! అన్నింటికన్నా ఉత్తమంగా పరమాత్మను వ్యక్తం చేసే తత్వం ఆనందం. అన్నము ప్రాణము, మనస్సు, విజ్ఞానము కూడా పరబ్రహ్మ రూపాలే. ఇవన్నీ ఒక దానికన్న మరొకటి సూక్ష్మమైనది. అన్నింటికీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనదికాదు. శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. ఆహారాన్ని వదలకుండా తింటూ ప్రాణాన్ని నిలుపుకుని, మనసును వికసింపచేసుకుని, దానివల్ల విజ్ఞానం పొంది తద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి" అన్నాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపము పంచకోశములందు ఉంటుంది.
2. సూక్ష్మదేహము -ప్రాణమయ, మనోమయ,విజ్ఞానమయకోశాలు
3. కారణదేహము -ఆనందమయకోశము
1. అన్నమయకోశంలో ప్రాణమయకోశం ఉంటుంది.
2. ప్రాణమయకోశంలో మనోమయకోశముంటుంది.
3. మనోమయకోశంలో విజ్ఞానమయకోశముంటుంది.
4. విజ్ఞానమయకోశంలో ఆనందమయకోశముంటుంది.
సృష్ట్యాది నిర్మాణములందు నేర్పు గలది. కాబట్టి కుశలా అనబడుతుంది. భూతభవిష్యద్వర్తమాన కాలాలలో ఎప్పుడూ వృద్ధి క్షయాలు అనేవి లేనిది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. క్షేమంగా ఉండేది. ఏ రకమైన వాంఛలు లేక తృప్తిగా ఉంటుంది. కాబట్టి కుశలా అనబడుతుంది. అన్ని విషయములందు అరితేరినది. అంటే పంచకృత్యాలయందు, సర్వవిధ విజ్ఞానమందు, చతుషష్టి కళలందు, అద్వితీయమైన నేర్పరి కాబట్టి కుశలా అనబడుతుంది.
కోమలము అంటే-మృదుత్వము. కాబట్టి కుసుమకోమలమైన ఆకారము గలది. ఒక్క దేవతలను, మానవులనే కాదు. క్రూరస్వభావులైన రాక్షసులను కూడా సమ్మోహింపచేయునది. సకల జన వశీకరణము చేయురూపము గలది.
కురుకుళ్ళా కులేశ్వరీ
కురువిందతరుణినిలయాం కులాచలస్పర్థి కుచనమన్మధ్యాం
శ్రీచక్రానికి ప్రధాన దేవత శ్రీదేవి. ఆమె శరీరం నుంచి వచ్చిన కాంతి పుంజాలు అష్టసిద్ధులైన అణిమాది దేవతలు. అలాగే సాదకుడి తండ్రి వారాహి. తల్లి కురుకుళ్ళావతి. ఇక్కడ మాతా అంటే సాధకుని కోరికలు తీర్చేది. ఐహికవాంఛలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించేది.
సుధాసింధువు మధ్యన మణిద్వీపమందున్న శ్రీదేవి పట్టణానికి చిత్తము - అహంకారము అనబడే రెండు ప్రాకారాల మధ్య విమర్శరూపమైన బావియందుండేది కురుకుళ్ళా దేవి అనే దేవత.
మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరము అనాహతము విశుద్ధిచక్రము ఆజ్ఞాచక్రము ఈ మార్గానికి కులమని పేరు. ఇదే సుషుమ్నా మార్గం. ఈ మార్గంలో సంచరించే ముఖ్యప్రాణ స్వరూపిణియే కురుకుళ్ళా దేవి. ఆమెయే కులేశ్వరి అనబడుతున్నది.
కులకుండాలయా
మూలాధారంలో కర్ణికమధ్యన ఉండే బిందువే కులకుండము. అతి సూక్ష్మంగా ఉంటుంది. అదే ఆ దేవి యొక్క స్థానము. అదే కుండలిని అనబడుతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ శంకర భగవత్పాదులవారు తమ
సౌందర్య లహరిలోని పదవశ్లోకంలో
సుధాధారాసారై-శ్చరణయుగలాంత-ర్విగలితైః
ప్రపంచం సిన్ఞంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ‖ 10 ‖
తల్లీ ! నీ పాదయుగము నుండి స్రవించు సుధాధారలచే ప్రపంచాన్ని తడిపే అమృతానికి నిధానమై, కాంతులు వెదజల్లే చంద్రుని వదిలి, నీ స్వస్థానమైన ఆధరాచక్రాన్ని చేరి అక్కడ భుజంగాకారము దాల్చి తామరదుద్దు మధ్యలో ఉన్న సన్నని రంధ్రమువలె మిక్కిలి సూక్ష్మమైన పృథివీతత్త్వమందు కుండలినీశక్తివై నిద్రింతువు, గతంలో చెప్పినట్లుగా ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసినట్లై, అది గ్రంథిత్రయాన్ని ఛేదించి సహస్రారం చేరి సుధాధారలు కురిపించి, ఆ తరువాత మళ్ళీ ఆధారచక్రంచేరి నిద్రావస్థలోకి జారుకుంటుంది.
వంశపారంపర్యంగా వచ్చిన మార్గము కులసంబంధమైనది. దానినే కౌళము అని పిలుస్తారు. వ్రతఖండము అనే గ్రంథంలో “ఎవరికి దేవి కులమార్గాన ఉన్నదో, వానిచేత ఆమె ధూపదీప నైవేద్యములచే పూజింపబడును" అని చెప్పబడింది. కులమార్గాన్ని అనుసరించి సంప్రదాయం ప్రకారము ఆమెకు వివిధరకాలయిన నైవేద్యములు సమర్పించటం జరుగుతుంది.
శ్రీ విద్యను ఉపాసించేవారు మూడు రకాలు అని గతంలో వివరించాం. వారు1. సమయాచారులు - వైదిక సంప్రదాయాలు పాటిస్తారు
2 మిశ్రమాచారులు - కౌళ, సమయాచారాలను మిళితంచేసి అర్చన చేస్తారు
3. కౌళాచారులు - తంత్రశాస్త్రాల ఆధారంగా పరమేశ్వరి అర్చన చేస్తారు. ఈ కౌళాచారులచే కులమార్గంలో పూజించబడుతుంది. కౌలము - కులమార్గము - పారంపర్యంగా అర్చించబడేది.
1. జనకవంశము- తండ్రి, తాత, ముత్తాత, ఆపై వారు.
2. విద్యావంశము- గురువు, పరమగురువు, పరమేష్టి గురువు
3. వర్ణము -కులాచారం
4. సుషుమ్నామార్గం.
వీటివల్ల సంక్రమించే విద్య పారంపర్యవిద్య. ఈ సంప్రదాయంలో పరమేశ్వరిని కౌళమార్గంలో అర్చించటం జరుగుతుంది. అందుకే ఆమె కౌళమార్గ తత్పరసేవితా అనబడుతుంది.
సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతురాలు. ఆ పరమేశ్వరి నుండి అనేక వేలకోట్ల కిరణాలు ప్రసరిస్తున్నాయి. అందులో అగ్ని 108 కిరణములు సూర్యుడు 116 కిరణములు చంద్రుడు 136 కిరణములు వెరసి 360 కిరణములను గ్రహించగలిగారు. సూర్యుని ప్రకాశమువల్ల పగలు, చంద్రకాంతులవల్ల రాత్రి, అగ్ని కాంతులవల్ల సంధ్యవేళలయందు ఈ జగత్తులోని వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. అని గతంలో వివరించాం. అయితే ఈ కిరణాలన్నీ శ్రీచక్రంలోని నవావరణల నుంచే ప్రసరిస్తున్నాయి అని కూడా అంటున్నారు.
త్రికోణంలో 3x5= 15 కిరణములుఅష్టకోణంలో 8x1= 8 కిరణములు
అంతర్దశారంలో 10X2 =20 కిరణములు
బహిర్ధశారంలో 10X6 =60 కిరణములు
చతుర్దశారంలో. 14x4 =56కిరణములు
అష్టదళపద్మములో 8x8 =64 కిరణములు
షోడశదళపద్మములో 16 x7 =112 కిరణములు
భూపురంలో. 10X3 =30 కిరణములు
మొత్తం 365 కిరణములు
ఇవే సంవత్సరానికి రోజులు. లలితా సహస్రంలోని శ్లోకాల సంఖ్య 182 1/2 అంటే 365 పాదాలు. ఇవే కాంతి కిరణాలుగా భావించాలి అని చెప్పారు. అయితే వృత్తము లేక బిందువులో 360 కిరణాలు లేదా డిగ్రీలు ఉంటాయి. అంతేకాని 365 కాదు. అందుచేత ఈ లెక్క సరిగా అగుపించటం లేదు. అయినప్పటికీ వారి మతాన్ని కూడా ప్రతిపాదించాం. ఈ రకంగా కాంతిని ఇచ్చే వాటికి మూలాధారమైనది కాబట్టి తేజోవతీ అనబడుతుంది.
అహః సూతే సవ్య తవ నయన-మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టి-ర్దరదలిత-హేమాంబుజ-రుచిః
సమాధత్తే సంధ్యాం దివసర్-నిశయో-రంతరచరీమ్ ‖ 48 ‖
ఓ దేవీ ! నీ కుడికన్ను సూర్యాత్మకము పగలు, ఎడమకన్ను చంద్రాత్మకము రాత్రి. నీ మూడవ నేత్రము సంధ్యాకాలము సూచించుచున్నది.


Comments
Post a Comment